Thursday, 28 June 2018

మే 2018 ఎకానమీ

జాతీయ వెదురు మిషన్ ఏర్పాటుకు ఆమోదం 
పునర్వ్యవస్థీకృత జాతీయ వెదురు మిషన్ (ఎన్‌బీఎం) ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 25న ఆమోదం తెలిపింది. రెండేళ్ల పాటు అమలు చేయనున్న ఈ పథకానికి రూ.1,290 కోట్లు కే టాయించగా ఇందులో కేంద్రం రూ.950 కోట్లు భరిస్తుంది. ఈ మిషన్‌లో భాగంగా ఈశాన్య రాష్ట్రాలు, తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, గుజరాత్, బిహార్, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో వెదురు చెట్ల పెంపకాన్ని ప్రోత్సహిస్తారు.
ముడి జనపనార కనీస మద్దతు ధరను క్వింటాల్‌కు రూ.200 పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో క్వింటాల్ ముడి జనపనార ధర రూ.3,700కు చేరింది.


భారత్‌కు బీబీబీ మైనస్’ గ్రేడ్: ఫిచ్
భారత్‌కు వరుసగా 12వ ఏడాదీ పెట్టుబడులకు తక్కువ గ్రేడ్ అయిన ‘బీబీబీ మైనస్’ ను అంతర్జాతీయ రేటింగ్ సంస్థ ఫిచ్ కొనసాగించింది. భారత దీర్ఘకాలిక కరెన్సీ జారీ డిఫాల్టింగ్ రేటును ‘బీబీబీ- స్థిరం’గా కొనసాగిస్తున్నట్టు ప్రకటించింది. భారత ఆర్థిక రంగం పలు పోటీ దేశాలతో పోల్చినప్పుడు తక్కువ అభివృద్ధి, ప్రపంచ బ్యాంకు గవర్నెన్స్ సూచీలో తక్కువ స్కోరు సాధించిందని, ఐక్యరాజ్య సమితి మానవాభివృద్ధి సూచీలోనూ వెనుకబడిందని ఫిచ్ పేర్కొంది. మధ్యకాలిక బలమైన వృద్ధి అంచనాలు, సానుకూల ఎక్స్‌టర్నల్ బ్యాలన్స్లు, బలహీన ద్రవ్య పరిస్థితులు, సంస్థాగత అంశాల వెనుకబాటు ఆధారంగా ఫిచ్ ఈ రేటింగ్‌ను ఇచ్చింది.

No comments:

Post a Comment